అమెరికాలో భూకంపం
6.5 తీవ్రత… 20-30 సెకన్లు కంపించిన భూమి
అమెరికా: కరోనాతో విలవిలలాడుతున్న అమెరికాను భారీ భూకంపం భయపెట్టింది. ఇదాహో రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూకంపం సంభవించిందని, దీని తీవ్రత 6.5 గా ఉందని నేడు నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించింది. నిన్న సాయంత్రం 20-30 సెకన్ల పాటు భూమి కంపించిందని, బోయిస్ ఈశాన్యంగా ఈ భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో భయంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. కొంతమంది ఇంట్లో వస్తువులు కదులుతుండగా తీసిన వీడియోలను సామాజిక మాద్యమాలలో పోస్ట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/