జపాన్లో భూకంపం
జపాన్లోని మియాగీ ప్రాంతంలో ఈ ఉదయం భూకంపం
టోక్యో: జపాన్ దేశంలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. జపాన్ దేశంలోని మియాగీ ప్రాంతంలో ఉదయం భూకంపం సంభవించిందని జపాన్ అధికారులు చెప్పారు. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైందని జపాన్ అధికారులు ప్రకటించారు. ఈ భూకంపం ప్రభావం టోక్యో మెట్రోపాలిటన్ ప్రాంతం కూడా ప్రభావితమైంది. ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం అందలేదు. ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని జపాన్ అధికారులు స్పష్టం చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/