ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్స్పై పన్ను
ఈ-కామర్స్ సైట్లపై వస్తువులు విక్రయించే వారిపై భారం
న్యూఢిల్లీ: ఈకామర్స్ ట్రాన్సాక్షన్స్ పైన 1 శాతం మేర టీడీఎస్ను కొత్త పన్నుగా విధించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. దీంతో ఈకామర్స్ సైట్లపై వస్తువులను విక్రయించే వారిపై భారం పడనుంది. ఇందుకు కొత్త సెక్షన్లు 194ఓను ప్రవేశ పెట్టనుంది. ఈకామర్స్ లావాదేవీలపై కొత్తగా ఒక శాతం టీడీఎస్ (మూల ధనం వద్ద పన్ను మినహాయింపు)ను విధిస్తూ కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం డిజిటల్ ప్లాట్ఫాంను నిర్వహించే ఈకామర్స్ ఆపరేటర్… విక్రేతల స్థూల అమ్మకాలకు సంబంధించి 1% టీడీఎస్ మినహాయించాల్సి ఉంటుంది. ఈ సవరణ ఏప్రిల్ 1, 2020 నుంచి అమలులోకి వస్తుంది. ఈ కామర్స్ ఆపరేటర్ లేదా డిజిటల్ ప్లాట్ ఫాంను నిర్వహించే వాళ్లు లేదా ఓనర్లు మొత్తం స్థూల విక్రయాలు లేదా సేవలు లేదా రెండింటి పైన ఒక శాతం టీడీఎస్ను విధించవలసి ఉంటుంది. అయితే, ఎవరైనా విక్రేత ఈకామర్స్ సైట్ ద్వారా జరిపిన స్థూల విక్రయాల మొత్తం రూ.5 లక్షలలోపు ఉండి ఆధార్ లేదా పాన్ను ఇచ్చి ఉంటే ఈ నిబంధన వర్తించదు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/