ద్వారకాతిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కరోనా నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహణ
West Godavari District: ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి స్వామి ఆలయంలో శనివారం వైశాఖమాస బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా అలంకరించారు. 26 రాత్రి స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఇఓ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెల 29 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/