Auto Draft
ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి శరన్నవరాత్రుల అలంకారాలు
” మహిషమస్తకనృత్త వినోదిని స్పుటరణన్మణి నూపుర మేఖలా
జననరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూదిని”
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో నవమి తిథిన అమ్మవారు మహిషాసు రమర్దినిగా దర్శనమిస్తుంది. దేవీ నవావతారాలలో అత్యుగ్రరూపం మహిషా సురమర్దినీదేవి. ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది.
ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వయుజ శుద్ధనవమినే ‘మహర్నవమి గా భక్తులు ఉత్సవం జరుపుకొంటారు. సింహ వాహనారూఢియై పాశం, పరుశు, త్రిశూలం, చక్రం, ఖడ్గం, విల్లు, ఆదిగా గల ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంతో ఈ రోజున దుర్గమ్మవారు దర్శనమిస్తుంది.
మహిషాసు రుడనే రాక్షసుడిని సంహరించిన అమ్మను మహిషాసురమర్దినీదేవీగా పూజిస్తే శత్రుభయం తొలగిపోయి సకల విజయాలు కలుగుతాయి.
అలంకారం: అమ్మవారిని మిరప పండు వర్ణంతో కూడిన పట్టుచీరతో అలంకరిస్తారు.
మంత్రం: ”ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యైస్వాహా అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. చండీ సప్తసతి హోమం చెయ్యాలి.
నైవేధ్యం: చిత్రాన్నం (పులిహార), గారెలు, వడపప్పు, పానకం నివేదన చేయాలి.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/