మద్యం మత్తులో మహిళ రైల్వేట్రాక్పై కారు డ్రైవింగ్
పోలీసులు కేసు నమోదు
Spain: మద్యం మత్తులో ఓ మహిళ రైల్వేట్రాక్పై కారు నడిపి చివరికి జైలుపాలైంది.. పరిమితికి మంచి మద్యం సేవించిన ఆ మహిళ దాదాపు కిలోమీటరు దాకా రైల్వేట్రాక్పై కారు నడిపింది..
కారు టైర్లు పంక్చర్కావటంతో చివరికి ట్రాక్పై కారు నిల్చిపోయింది.. ఈ ఘటన స్పెయిన్లోని మాలగాలో తాజాగా చోటుచేసుకుంది. అఘటనకు సంబంధించి వీడియో సోషల్మీడియాలో వైరల్ అయ్యింది..
చివరకు ఆమెను మెట్రో సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీశారు.. ఈ మహిళ వయస్సు 25 ఉంటుందని, బ్రీట్ ఎనలైజర్ పరీక్షలో లీటరుకు 0.85 మిగ్రా ఆల్కాహాల్ ఉన్నట్టుగా తేలింది..
ఇది చట్టపరంగా అనుమతి ఉన్న పరిమితికి మూడు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం.
నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు గానూ, పోలీసులు ఆమెను అరెస్టుచేసి కేసు నమోదు చేశారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/