హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్టు..

హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డగా మారిందనే విమర్శలు వస్తున్న క్రమంలో శనివారం బంజారాహిల్స్ లోని పుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్ బయటపడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రాజకీయ పార్టీలు ఈ వ్యవహారాన్ని అడ్డు పెట్టుకొని తెలంగాణ సర్కార్ ఫై నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి డ్రగ్స్ కు సంబదించిన వివరాలను తెలుసుకొనే పనిలో పోలీసులు ఉన్నారు.

ఇదిలా ఉంటె.. గత కొద్దీ రోజులుగా డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అయినా లక్ష్మీపతి..ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. ఆంధ్ర లో లక్ష్మీపతిని అదుపులోకి తీసుకుంది హెచ్ న్యూ వింగ్. హైదరాబాద్ డ్రగ్ కేసులో లక్ష్మీపతి కోసం ఐదు రోజులుగా గాలించిన పోలీసులకు… ఈరోజు ఏపీలో అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ విద్యార్థి మృతిలో కీలక సూత్రధారిగా లక్ష్మీపతి ఉన్నాడు.

బీటెక్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే గంజాయికి అలవాటు పడ్డ లక్ష్మీపతి …ఏడేళ్లుగా గంజాయికి బానిసై గంజాయి , డ్రగ్స్ తీసుకుంటూ , అమ్ముతూ వస్తున్నాడు. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఆశిష్ ఆయిల్ తెచ్చి అమ్మడం మొదలు పెట్టాడు. రూ.లక్షకు లీటర్ ఆశిష్ ఆయిల్ కొనుగోలు చేసిన లక్ష్మీపతి.. హైదరాబాద్‌లో లీటర్ ఆశిష్ ఆయిల్‌ని రూ. 8లక్షలకు అమ్మడం మొదలు పెట్టాడు. ప్రేమ్‌ కుమార్, లక్ష్మీపతి కలిసి డ్రగ్స్ అమ్మకాలు కొనసాగించాడు. ఈ క్రమంలో రీసెంట్ గా బిటెక్ విద్యార్థి డ్రగ్స్ కు అలవాటు పడి చివరకు ప్రాణాలు వదిలాడు.