డ్రగ్స్ కేసు : మరికొద్ది సేపట్లో హీరో రానాను విచారించబోతున్న ఈడీ అధికారులు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా ఈరోజు (సెప్టెంబర్ 8 ) సినీ నటుడు రానా ను ఈడీ అధికారులు విచారించబోతున్నారు. ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాధ్ , నటి ఛార్మి , రకుల్ ప్రీతీ సింగ్ , నందు లను విచారించిన అధికారులు వారిని నుండి కీలక సమాచారాన్ని సేకరించారు. గతంలో 2017 జరిపిన ఎక్సైజ్‌ విచారణలో రానా,రకుల్‌ల పేర్లు తెరపైకి రాలేదు. అయితే డ్రగ్స్‌ పెడ్లర్‌ కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో వారిద్దరికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇవాళ ఉదయం 10.30 గంటల సమయం లో ఈడీ కార్యాలయానికి దగ్గుబాటి రానా రానున్నారు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు , కెల్వీన్‌ కు ఉన్న సంబంధాలు , మనిలాండరింగ్ వ్యవహారం పై రానాను ప్రశ్నించునున్నారు ఈడీ అధికారులు.

సెప్టెంబర్ 07వ తేదీ మంగళవారం నటుడు నందును సుదీర్ఘంగా ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఈ నెల 20వ తేదీన నందు విచారణకు హాజరుకావాల్సి ఉంది కానీ ముందుగానే పిలిపించి పలు వివరాలు రాబట్టారు దర్యాప్తు బృందం అధికారులు. అలాగే నిన్న కెల్విన్‌ను తీసుకొచ్చి నగదు లావాదేవీలపై ఆరా తీసింది. ఐదు గంటలపాటు కెల్విన్‌ను విచారణ జరపింది. సినీ ప్రముఖులతో సంబంధాలు, డ్రగ్స్‌ కొనుగోళ్లు, బ్యాంకు లావాదేవీలను తెలుసుకుంది. డ్రగ్స్‌ కోసం విదేశాలకు నగదు తరలింపు, బ్యాంక్‌ అకౌంట్ లెక్కలను గుచ్చిగుచ్చి ప్రశ్నించింది. కెల్విన్‌తో పాటు వేర్వేరు ప్రాంతాల నుంచి కుదూస్‌, వాహిద్‌లను ఈడీ కార్యాలయాలనికి భద్రత నడుమ తీసుకొచ్చి ప్రశ్నించారు.