ఎమ్మెల్యేల హక్కులను హరించడం హేయం: చంద్రబాబు

విశాఖలో ఎమ్మెల్యే ‘వెలగపూడి’పై దాడికి ఖండన

Chandrababu
Chandrababu

Amaravati: విశాఖలో ఎమ్మెల్యే ‘వెలగపూడి’పై జరిగిన దాడిని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు.

అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయకుండా ఎమ్మెల్యేను అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే హక్కు ఎమ్మెల్యేలకు లేదా? అని నిలదీశారు.

రాజ్యాంగ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యేల హక్కులను హరించడం హేయమని విమర్శించారు.  విశాఖ దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్తలకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.

అలాగే దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/