కరోనా వైరస్ గురించి ఆందోళన చెందకండి
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో వస్తున్న ఊహాగానాలు ప్రచారాన్ని నమ్మవద్దని ఏపీ ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి సూచించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో ఓ మేసేజ్ ఉంచారు. ప్రభుత్వం ముందుజాగ్రత్తగా చర్యలు తీసుకుంటోందని, మన బాధ్యతగా వ్యక్తిగత పరిశ్రుభత్ర కూడా పాటించాలని ఆమె పిలుపునిచ్చారు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే తక్షణం వైద్యుడిని సంప్రదించాలని, దూరప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే 0866-2410978 నంబర్కు ఫోన్ చేసి వైద్యం సహాయం పొందాలని కోరారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/