భారత్ పర్యటన ఖరారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై శ్వేతసౌధం కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనున్నట్లు వెల్లడించింది. ట్రంప్ భారత్కు రాడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆయన సతీమణి, ప్రథమ పౌరురాలు మెలానియాతో కలిసి భారత్కు రానున్న ట్రంప్.. ఢిల్లీ, అహ్మదాబాద్లో పర్యటించనున్నారని శ్వేతసౌధం మీడియా సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్ వెల్లడించారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఆకాంక్షించారు. ఉభయ దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ ట్రంప్ పర్యటన ఖరారు కావడాన్ని ఇరు దేశాల వ్యాపార వర్గాలు స్వాగతించాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/