ముఖ్యమంత్రికి కర్నూలుకు వెళ్లే ధైర్యం ఉందా?
టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు
అమరావతి: అత్యధిక కరోనా కేసులు నమోదు అయిన కర్నూలు జిల్లాకు వెళ్లే ధైర్యం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కు ఉందా అంటు టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వర రావు సవాల్ విసిరారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరితంగా పెరుతున్నప్పటికి ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రాసాదాన్ని వదిలి బయటకు రావడంలేదని అన్నారు. అసలు రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న విషయం ముఖ్యమంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలలోకి వెళ్తే వాస్తవాలు తెలుస్తాయని, అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో 12 జిల్లాలు రెడ్జోన్ లోకి వెళ్లాయని, ఇకనైనా కేసులు, రిపోర్టుల విషయంలో వాస్తవాలను తెలియపరచాలనలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/