డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్కు హైకోర్టు అనుమతి
సీబీఐ విచారణకు సహకరించాలని సూచన

అమరావతి: డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్కు హైకోర్టు అనుమతినిచ్చింది. డాక్టర్ సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ పూర్తి అయ్యింది. డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్కు ధర్మాసనం సమ్మతించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్కు తెలియజేసి ఎప్పుడైనా డిశ్చార్జ్ కావొచ్చని కోర్టు తెలిపింది. అలాగే, ప్రస్తుతం కొనసాగుతోన్న సీబీఐ విచారణకు ఆయన సహకరించాలని చెప్పింది. తనకు ఎటువంటి అనారోగ్యం లేదని అయినప్పటికీ మానసిక వైద్య శాలలో ఉంచారని సుధాకర్ వాదిస్తోన్న విషయం తెలిసిందే. సుధాకర్ను అరెస్టు చేయలేదని, అలాంటప్పుడు తన కుమారుడిని ఏ ప్రాతిపదికన ఆసుపత్రిలో బంధించారని ప్రశ్నిస్తూ ఆయన తల్లి హైకోర్టులో వేసిన పిటిషన్లో ప్రశ్నించారు. ఇరు వర్గాల వాదన విన్న హైకోర్టు ఈ సూచనలు చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/