నిన్న ఒక్క రోజే తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా..?

మామూలుగానే తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఏదైనా పండగ వస్తే అమ్మకాలు మరింతగా ఉంటాయి.ఇక నిన్న (డిసెంబర్ 31) మద్యం అమ్మకాలు రికార్డు స్థాయి లో జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే అబ్కారీ శాఖకు 215 కోట్ల 74 లక్షల ఆదాయం వచ్చిందట. వ్యాప్తంగా మొత్తం 19 మద్యం డిపోల నుండి జరిగిన రిటైల్ అమ్మకాలు ఇలా ఉన్నాయి.

జనవరి 1 ఉదయం 12 గంటల వరకు సుమారుగా 2 లక్షల 17 వేల 444 లిక్కర్ కేసులు అమ్ముడయ్యాట.
అంటే సుమారుగా ఒక లక్ష 28వేల 455 కేసుల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. హైదరాబాద్ 1 డిపో 15 వేల 251 లిక్కర్ కేసులు, 4వేల 141 కేసుల బీర్ కేసులు, 16కోట్ల 90 లక్షలు ఆదాయం. హైదరాబాద్ 2 డిపో 18 వేల 907 లిక్కర్ కేసులు 7వేల 833 బీర్ కేసులు, 20 కోట్ల 78 లక్షల ఆదాయం. హైదరాబాద్ రెండు డిపోల్లో వచ్చిన ఆదాయం 37 కోట్ల 68 లక్షల ఆదాయం” వచ్చిందట. ఈ లెక్కన మిగతా అన్ని డిపోలో ఏ రేంజ్ లో అమ్మకాలు జరిగాయో చెప్పొచ్చు. మొత్తం మీద న్యూ ఇయర్ ను మందుబాబులు గట్టిగానే చేసుకున్నారు.