దాడులు చేస్తే ఉపేక్షించేది లేదు… కెటిఆర్‌

వారు అజ్ఞానులే కాదు.. వారి వల్ల ఇతరులకు కూడా ప్రమాదమే

ktr
ktr

హైదరాబాద్‌: ప్రజల ప్రాణాలను కాపాడడానికి, తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్న వైద్య సిబ్బందిపై కొంతమంది దాడికి దిగుతున్నారు. మరికొంతమంది విదులకు అడ్డు తగులుతున్నారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటిఆర్‌ అన్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిపై జరిగిన దాడిని ఖండించారు. నిజామాబాద్‌లో వైద్యులను అడ్డుకోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిపై దాడి, నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకున్న ఘటనలను సహించేదిలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తుంది. ఇలాంటి పనులు చేసే వ్యక్తులు అజ్ఞానులే కాదు,వారి వల్ల ఇతరులకు కూడా ప్రమాదమే,. అని ట్వీట్‌ చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/