భీమ్లా నాయక్ నిర్మాత మరో సినిమాను వాయిదా వేసాడు

కరోనా మహమ్మారి దెబ్బ మరోసారి చిత్రసీమ ఫై భారీగా పడింది. గత రెండేళ్లు గా కరోనా వైరస్ చిత్రసీమ ను కోలుకోకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఆరు నెలలుగా వైరస్ తీవ్రత తగ్గడం తో చిత్రసీమ ఊపిరి పీల్చుకుంది. వాయిదా పడ్డ సినిమా షూటింగ్ లను పూర్తి చేసి సంక్రాంతి బరిలో దింపాలని అనుకున్నారు. కానీ నవంబర్ నుండి కేసులు మొదలవ్వడం..జనవరి మొదటివారానికి గాను లక్షల్లో చేరడం తో అనేక రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ , వీకెండ్ లాక్ డౌన్ లు ప్రకటించారు.

దీంతో సంక్రాంతి కి రావాలనుకున్న పెద్ద చిత్రాలు వాయిదా పడ్డాయి. దీంతో చిన్న సినిమాలన్నీ సంక్రాంతికి ఫిక్స్ అయ్యాయి. వాటిలో ‘డీజే టిల్లు’ ఒకటి. యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘ డీజే టిల్లు’. ‘అట్లుంటది మనతోనే’ అనేది సినిమా ఉపశీర్షిక. నేహా శెట్టి ఈచిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.

భీమ్లా నాయక్ మూవీ కి బ్రేక్ పడడంతో ఆ స్థానంలో డీజే టిల్లు ను రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఈ సినిమాను కూడా వాయిదా వేసినట్టు తెలిపాడు. ‘కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న కారణంగానూ, అలాగే మా టీమ్‌లోనూ కొందరు కోవిడ్ బారిన పడటంతో.. ‘డీజే టిల్లు’ చిత్రాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాము. ఈ క్రేజీ చిత్రాన్ని ఇప్పటికి వాయిదా వేస్తున్నప్పటికీ.. త్వరలోనే మళ్లీ థియేటర్లలోకి తీసుకువస్తామని తెలియజేస్తున్నాము..’’ అని చిత్రయూనిట్ ప్రకటించింది.