ఈనెల 23న అయోధ్యలో పర్యటించనున్న ప్రధాని మోడీ

మహా దీపోత్సవ్‌ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ..

pm modi

న్యూఢిల్లీ: దీపావళి పండుగ నేపథ్యంలో యూపీలోని రామజన్మ భూమి అయోధ్య నగరం ముస్తాబవుతోంది. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ప్రధాని మోడీ ఆదివారం (అక్టోబర్ 23) ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పర్యటించనున్నారు. అనంతరం స్థానికులతో కలిసి దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. పవిత్ర నగరమైన అయోధ్యలో ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పవిత్ర నగరం అయోధ్యలో జరిగే మహా వేడుకలో ప్రధాని మోదీ లక్షలాది మంది భక్తుల మధ్య పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు ప్రధాని మోడీ షెడ్యూల్‌ను విడుదల చేశారు..

అంతేకాక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రధాని మోడీ గత ఎనిమిదేళ్లుగా జవాన్లతో కలిసి దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రధాని మోడీ అక్టోబర్ 24న జమ్మూ కాశ్మీర్‌లో భారత సాయుధ దళాల సైనికులతో కలిసి దీపావళి జరుపుకునే అవకాశం ఉంది. జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను కూడా సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు.