దైవమే శరణ్యం
ఆధ్యాత్మిక చింతన
భగవంతుని సృష్టిలో ఆలోచించే శక్తి, విచక్షణా జ్ఞానం, నవ్వగలిగే అదృష్టం మనిషికే ఉన్నాయి. మనిషిగా పుట్టడమే ఒక వరం. కనుమూసి తెరిచేలోగా ముగిసే ఈ అపురూపమైన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
సత్కర్మలతో ఉదాత్తమైన ఆలోచనతో మనుగడ సాగించడం మంచిది. అయితే తనని సృష్టించిన విధాతను విస్మరించి విడనాడి తాను వివ్వవిజేతనని, అంతా తన గొప్పేనని విర్రవీగడం మనిషకిఇ తగదు.
విజ్ఞానపరంగా మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉంటేనే మంచిది. ఎన్ని మహత్తర విజయాలు సాధించినా మనిషి మర్త్యుడే.
మృత్యువ్ఞ తప్పదని తెలిసిని ఎగిసిపడుతున్న మనిషి అమరుడైతే ఎలా ఉంటుంది. మనిషి తను చేస్తున్న ప్రతి పని తన ఘనతే అనుకుంటాడు.
కాని భగవంత్సంకల్పంలేనిదే ఏదీ జరగదనే సత్యాన్ని గ్రహించాలి. మానవశక్తి వెనుక ఓ అదృశ్య శక్తి ఉంది. ఆ శక్తే దైవం. ఆ దైవాన్ని స్మరించడం మనం చూపే విశ్వాసం.
మనిషి జగత్తునే శాసించగల స్థాయికి ఎదిగాడంటే అది భగవంతుని కరుణాకటాక్షమే గదా.
మనిషి జీవితం అశాశ్వతమని, తాను విధి చేతిలో కీలుబొమ్మననే నిజాన్ని మరచి భ్రమలో బతుకుతూ తనకి జన్మనొసగిన దైవాన్ని కాదని ఆ పరాత్పరుని ఉనికినే ప్రశ్నిస్తూ అహంకారదర్పంతో మిడిసిపడటం గర్హనీయం.
ఈ జీవితం నీటి బుడగ అని గ్రహించి కర్తవ్యాన్ని నర్విహిస్తూ లభ్యమైన అరుదైన మానవ జన్మను సార్ధకం చేసుకోవడం వివేకవంతుల లక్షణం.
అయితే ఈ జన్మలో ఆంతర్యాన్ని అంతరార్ధాన్ని అవగతం చేసుకున్న వారు జీవితాసారాన్ని అవగాహన చేసుకున్న జ్ఞానులు జన్మరాహిత్యాన్నే కోరుకుంటారు.
మనిషి ఎంతటివాడైనా నైచ్యానికి దిగజారేడంటే తన స్వార్ధం కోసం, సౌఖ్యం కోసం తన సంపద పెంచుకోవటానికి తోడబుట్టిన వారికి అన్యాయం చేయడం, ఇక్కట్లకు గురిచేయడం అలవాటు చేసుకున్నాడు.
వీరికి దైవభీతి పాపభీతి ఉండవ్ఞ. చిత్రమేమిటంటే ఇటువంటి వారిలో విద్యాధికులే ఎక్కువ. ఎంత ఆర్జించినా ఈ దేహం అశాశ్వతం,
ఇహబంధాలు ఆనందాలు ఆకర్షణలు అసత్యం. ఆస్తులు, ఐశ్వర్యాలు వెంటరావ్ఞ. బంధువ్ఞలు, బాంధవ్యాలు ఎవరు కాని శ్మశానం వరకే వస్తారు.
కట్టుకున్న ఇల్లాలు గడపదాటిరాదు. ఆ తర్వాత ఎవరికెవరు? కలకాలం నిలిచేది మంచి, పాపపుణ్యాలే.
బుద్ధుదు రాజ్యం సకలభోగభాగ్యాలు సమస్తం తృణప్రాయంగా ఎంచి పరిత్యజించాడు.
తనను కట్టుకున్న భార్యను వీడి, జీవిత పరమార్ధం తెలుసుకునేందుకు జీవితాన్ని అంకితంచేసాడు.
వేమన అనిత్యమైన దుఃఖపూరితమైన శారీరక బంధాలపైన భోగిగా ఉన్నవాడు యోగిగా మారాడు. మనిషిగా తన కర్తవ్యం ఏమిటని అన్వేషణ సాగించాడు.
ఈ జీవితం ఎంత నమ్మరానిదో ఈయన మాటల్లో తెలుస్తుంది. క
డకు వీడిపోవ్ఞ కపటి రాజీవ్ఞడు అన్నాడు. ఓటికుండ నుంచి నీరు పోవ్ఞనట్లు మనుషుని ఆయువ్ఞ కూడా పోతుంది. చాలామంది అయ్యో అప్పుడే ఆయువ్ఞ తీరిపోయిందా అని బాధపడతారు.
ఎంతకాలం బతికాడనేది ముఖ్యం కాదు. ఎలా బతికేమనేది ముఖ్యం. మనిషినైజం ఆ దైవానికి ఎరుక. తన ఉనికినే సవాలు చేసే మనిషికి తగు పాఠం నేర్పాలనేదే ఆయన ఉద్దేశం.
-ఉలాపు బాలకేశవులు
తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/