కార్మికులకు,ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ
మంత్రి గంగుల కమలాకర్ హాజరు
Karimnagar: కరీంనగర్ లో మూడు వేల మంది కార్మికులకు,ఆటో డ్రైవర్లకు మంత్రి గంగుల కమలాకర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. దాతల నుంచి వచ్చిన రూ.15లక్షల సాయంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
ప్రభుత్వం లాక్ డౌన్ పొడగించిన నేపథ్యంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ప్రజా సహకారంతో కరోనాపై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/