దిశ చట్టం ఆడపడుచులకు రక్షణ కవచం

దేశమంతా మన రాష్ట్రం వైపు చూస్తుంది

kodali nani
kodali nani

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ రోజు రాజమహేంద్రవరంలో దిశ మహిళా పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభించారు. దీనిపై మంత్రి కొడాలి నాని ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. దిశ చట్టం ఆడపడుచులకు రక్షణ కవచం అన్నారు. దేశమంతా మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంవైపు చూసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌గారు దిశ చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. ఈ చట్టం ఏపీలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా దిశ పోలీస్‌ స్టేషన్‌, దిశ యాప్‌ను ప్రారంభిస్తున్న సీఎం గారికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి కొడాలి నాని.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/