వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభించిన సీఎం
45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే వారి కోసం పథకం
అమరావతి: సీఎం జగన్ వైఎస్సార్ చేయూత పథకాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. అందులో భాగంగానే బుధవారం మొదటి విడత సాయంగా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.18,750లు జమచేశారు. బడ్జెట్లో వైఎస్సార్ చేయూత పథకానికి రూ.4,700కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా దాదాపు 25 లక్షల మంది మహిళలు లబ్ధిపొందుతారు. మహిళల సాధికారిత కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అమూల్, ఐటీసీ, హెచ్యూఎల్ వంటి పలు సంస్థలతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. మహిళలు వ్యాపారస్తులుగా ఎదగడానికి అవసరమైన టెక్నాలజీ, మార్కెటింగ్ సాయాన్ని ఈ సంస్థలు మహిళలకు అందించనున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/