రాహుల్ జోడో యాత్ర లో అపశృతి

rahul

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ప్రస్తుతం రాహుల్ యాత్ర సంగారెడ్డి లో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాహుల్ కాన్వాయ్‌ ఓ కానిస్టేబుల్ కాలుపై నుంచి వెళ్లింది. దీంతో కానిస్టేబుల్ శివకుమార్ కాలు విరిగింది. పాపన్న పేట పోలీస్ స్టేషన్‌లో శివకుమార్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వెంటనే కానిస్టేబుల్‌ను 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

భారత్ జోడోయాత్రను రాహుల్ గాంధీ హుషారుగా సాగిస్తున్నారు. నిన్న విశ్రాంతి తీసుకున్న రాహుల్, ఇవాళ వేకుజామునే లేచి పాదయాత్ర చేపట్టారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌లో బసచేసిన రాహుల్ జోడోయాత్రను ఇవాళ ఉదయాన్నే మొదలు పెట్టారు. చౌటకూర్, ఆందోల్, జోగిపేట, అన్నసాగర్ మీదుగా కొనసాగనున్న యాత్ర అల్లాదుర్గ్ వద్ద మెదక్ జిల్లాలోకి ప్రవేశించనుంది. రాహుల్ గాంధీ పాదయాత్ర ఇవాళ 25 కిలోమీటర్లమేర కొనసాగించనున్నారు.