పాన్ ఇండియా సినిమాలు అందుకే చేస్తున్నాను – దిల్ రాజు

నిర్మాత దిల్ రాజు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. డిస్ట్రబ్యూటర్ గా చిత్రసీమలో అడుగుపెట్టిన రాజు..ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్స్ లలో ఒకరిగాఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన రాజు..ప్రస్తుతం వారసుడు మూవీ తో సంక్రాంతి బరిలో రాబోతున్నారు. తమిళ్ హీరో విజయ్ – రష్మిక జంటగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు , తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్య క్రమాలు చేపట్టి సినిమా ఫై అంచనాలు పెంచుతున్న రాజు..తాజాగా పాన్ మూవీస్ ఫై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసారు.

తెలుగు నుండే పెద్ద సినిమాలు వస్తున్నాయనడం కరెక్టు కాదని , కన్నడ .. తమిళ భాషల్లోను పెద్ద సంస్థలు చాలానే ఉన్నాయి. వాళ్లంతా కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారని రాజు అన్నారు. ఇప్పుడు సినిమా అనేది ఒక భాషకి .. ఒక ప్రాంతానికి పరిమితం కావడం లేదు” అన్నారు. వందల కోట్ల బడ్జెట్ లో నేను సినిమాలు చేయడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. అయితే పాన్ ఇండియా సినిమాకి లెక్కలు వేస్తూ కూర్చోవడం కరెక్టు కాదు. రిస్క్ చేయడం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను. తెలుగు సినిమా ఎదిగింది .. దానితో పాటే నేను కూడా పెరిగాను. అందువల్లనే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాను అని తెలిపారు. వారసుడు మూవీ తో పాటు శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా పెట్టి పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు దిల్ రాజు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది.