18వ రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెట్రోల్‌ కంటే అధికంగా డీజిల్‌ ధర

Reduced petrol prices
petrol prices

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వరుసగా 18వ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దీంతో బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దాదాపు ఒకే ధర పలుకుతున్నాయి. అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర 79.88 రూపాయలుగా కాగా, డీజిల్‌ ధర 79.40 రుపాయలుగా ఉంది. అంటే ఒక్క రోజులో లీటర్‌ డీజిల్‌పై ధర 48 పైసలు పెరిగింది. 18 రోజుల వ్యవధిలో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 9.41రూపాయలు, డీజిల్‌ 9.58 రూపాయలు పెరిగాయి. ఇంటర్నేషనల్‌‌ బెంచ్‌‌మార్క్ రేట్ల ప్రకారం ఎక్కడైనా పెట్రోల్‌‌ ధర డీజిల్‌‌ కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ ఢిల్లీ ప్రభుత్వం డీజిల్‌‌పై వ్యాట్‌‌ను భారీగా పెంచడంతో దేశ రాజధానిలో పెట్రోల్‌ కంటే డీజిల్‌ ఖరీదుగా మారింది. అయినప్పటికీ ఇతర మెట్రో నగరాలైన కోల్‌కత్తా, ముంబై , చెన్నైలలో డీజిల్‌ రేట్ల కంటే పెట్రోల్‌ ధరలు అధికంగా ఉన్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/