వివేకా హత్య కేసు ..దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి సీబీఐ కస్టడీ

7 రోజులు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు


పులివెందుల: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవలే కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ… అతడిని 8 రోజులు కస్టడీకి అప్పగించాలంటూ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం శివశంకర్ రెడ్డిని సీబీఐ కస్టడీకి అనుమతించింది. అయితే 7 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 2 వరకు సీబీఐ కస్టడీ కొనసాగనుంది. ప్రస్తుతం శివశంకర్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/