ఇంటి స్థలాల పేరుతో దోపిడీ
జేబులు నింపుకుంటున్న వైఎస్ఆర్సిపి నేతలు
అమరావతి: టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపిలో వైఎస్ఆర్సిపి నేతలు ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలో ఆయన వైఎస్ఆర్సిపి నేతలు భూముల కొనుగోళ్ల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని తెలుపుతూ ఇందుకు సంబంధించిన పలు వీడియో క్లిప్లను ఒకచోట చేర్చి టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరరావు పోస్ట్ చేశారు. ‘ఇంటిస్థలాల పేరుతో భారీ కుంభకోణం, జేబులు నింపుకుంటున్న వైఎస్ఆర్సిపి నేతలు, ఒక్క ఆవలోనే ఐదు వందల కోట్లు మెక్కేశారు, మైలవరం, ఆవలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలకోట్ల దోపిడీ. భూముల కొనుగోలు, మెరక పేరుతో మీ ప్రజాప్రతినిధుల వారి బంధువుల దోపిడీపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదో చెప్పండి వైఎస్ జగన్ గారు’ అని దేవినేని ఉమ నిలదీశారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/