సీఆర్‌డీఏ ఉనికిలోకి రాకముందు లావాదేవీలు

ప్రభుత్వపెద్దలు చెప్పినట్లు నివేదికదేవినేని

devineni uma maheswara rao
devineni uma maheswara rao

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ‘ఇన్‌సైడర్’ పేరిట అమరావతి భూములపై రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందంటూ టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. సీఆర్‌డీఏ ఉనికిలోకి రాకముందు జరిగిన
లావాదేవీలన్నీ ‘ఇన్‌సైడర్’ ఖాతాలోనే లెక్కకడుతున్నారని ఆయన చెప్పారు. సుదూరంగా భూములు కొన్నా అక్రమమేనంటూ వైఎస్‌ఆర్‌సిపి సర్కారు చెబుతోందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. అమరావతి భూముల విషయంలో ప్రభుత్వపెద్దలు చెప్పినట్లు మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఇచ్చిందని ఆయన ఆరోపించారు.

‘సీఆర్‌డీఏ ఉనికిలోకి రాకముందు లావాదేవీలు ఇన్సైడర్ ఖాతాలోకే.. సుదూరంగా భూములుకొన్నా అక్రమమేనంట.. ప్రభుత్వపెద్దలు చెప్పినట్లు నివేదిక.. రాజధాని రైతుల ఆగ్రహం.. విశాఖ చుట్టూ వైఎస్‌ఆర్‌సిపి కొనుగోళ్లను ఏమంటారు? సర్కారువారి ఇన్సైడర్ ట్రేడింగ్ డ్రామాలో ఉపసంఘం శోధించి తేల్చిందేమిటో ప్రజలకు చెప్పండి వైఎస్‌ జగన్‌ గారూ’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/