జగనన్న విద్యా కానుక పై దేవినేని స్పందన

పాఠ్యపుస్తకాలు, షూ, యూనిఫాం టిడిపి హయాంలో ఇచ్చినవే

devineni uma
devineni uma

అమరావతి: నేడు సిఎం జగన్‌ జగనన్న విద్యా కానుక ప‌థ‌కాన్ని ప్రారభించనున్న విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘పాఠ్యపుస్తకాలు, షూ, యూనిఫాం, కుట్టు కూలి టిడిపి హయాంలో ఇచ్చినవే. ఢిల్లీ, కేరళలో ఇంకా మెరుగ్గా పథకం.. ఇంటికే బుక్స్ పంపిన కేరళ.. చంద్ర‌బాబు ఉచితసైకిల్ పథకానికి మంగళం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం రద్దు. పాతపథకానికి కొత్త సోకు కాదా? ఖర్చుపెట్టిన కోట్లన్ని రివర్స్ టెండరింగ్ లోనే ఇచ్చారా? వైఎస్ జ‌గ‌న్’ అంటూ దేవినేని ఉమ ప్ర‌శ్నించారు. పాత పథకానికే కొత్త పేరు పెట్టార‌ని, ఒక్కో విద్యార్థిపై పెట్టే ఖర్చు రూ.1500 మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. పాఠ్య పుస్తకాలు, షూ, సాక్సులు, యూనిఫాం గతంలోనూ పంపిణీ చేశార‌ని, కొత్తగా బెల్టు, బ్యాగ్‌, టై, వర్క్‌బుక్స్ తాము మాత్రమే ఇస్తున్నట్టు ప్రకటనలు చేసుకుంటున్నార‌ని అందులో ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/