అసమర్థత, అవినీతికి విద్యార్థుల భవిష్యత్తు బలికావాలా?

ఈ ఏడాది అమ్మఒడిని ప్రభుత్వం ఎగ్గొట్టింది: దేవినేని ఉమ

అమరావతి: వైస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఏడాది అమ్మఒడి పథకాన్ని తప్పించిందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ఈ ఏడాది అమ్మఒడిని ప్రభుత్వం ఎగ్గొట్టిందని అన్నారు. ప్రభుత్వ తీరుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఎన్నికల ముందు అందరికీ అని చెప్పి… అధికారంలోకి వచ్చాక ఒక్కరికేనని మోసం చేశారని మండిపడ్డారు. విదేశీ విద్య, స్కాలర్ షిప్ లకు మంగళం పాడారని అన్నారు. ప్రభుత్వ అసమర్థత, అవినీతికి విద్యార్థుల భవిష్యత్తు బలికావాలా చెప్పండి జగన్ గారూ? అని ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/