ప్రముఖ మద్యం బ్రాండ్లన్ని రాష్ట్రం నుంచి పరార్

షాక్ కొట్టే ధరల వెనక వేల కోట్ల రూపాయల దందా?

devineni uma maheswara rao
devineni uma maheswara rao

అమరావతి: టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపి ప్రభుత్వం పై మండిపడ్డారు. పశ్చిమ గోదావరిలో ఖఅదాన్‌ డిస్టిలరీస్‌గ మూడు నాలుగు నెలల కిందటే ఏర్పాటైందని, మద్యం మార్కెట్‌లో అధిక గిరాకీతో దుమ్మురేపుతోందని పేర్కొన్నారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఆ మద్యం కంపెనీలు ఎవరివని దేవినేని ఉమ నిలదీశారు. ‘ప్రముఖ మద్యం బ్రాండ్లన్ని రాష్ట్రం నుంచి పరార్.. అవన్నీ మర్చిపోండి మేంపోసింది తాగండి.. కొత్త, చెత్త, చీఫ్ బ్రాండ్లతో సామాన్యుడి ఆరోగ్యంతో ఆటలు. షాక్ కొట్టే ధరల వెనక వేల కోట్ల రూపాయల దందా? నియంత్రణ పేరు సొంతబ్రాండ్ ల డిమాండ్ కోసమేనా? ఆ మూడు మద్యం కంపెనీలు ఎవరివి? తయారీదారులు ఎవరు? చెప్పండి వైఎస్‌ జగన్‌ గారు?’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/