20 కోట్లతో వేములవాడలో అభివృద్ధి పనులు
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయన నియోజకవర్గంలో చేపట్టే పనుల వివరాలను మంత్రికి అందించారు. అనంతరం మంత్రి కేటీఆర్ వేములవాడ అభివృద్ధిపై సమీక్షించి, అభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ చేశారు. వేములవాడ నియోజకవర్గంలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. రూ.20కోట్ల విలువైన పనులు ప్రారంభించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే రమేశ్బాబు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/