నార్సింగిలో పేలిన డిటోనేటర్‌

హైదరాబాద్ నార్సింగిలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ డిటోనేటర్ పేలడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం సంబంధిత కాంట్రాక్టర్‌ రోడ్డు పనుల్లో భాగంగా బండరాళ్ల మధ్య అమర్చిన మూడు డిటోనేటర్‌లో ఒకటి బుధవారం ఒక్కసారిగా పేలిపోయింది.

దీంతో బండరాళ్లు ఆకాశంలోకి ఎగిరి కిందపడడంతో అక్కడ పనిచేస్తున్న కొందరు భయాందోళనతో పారిపోగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.