టెక్కలిలో బుద్ధుడి విగ్రహం ధ్వంసం
ఏపీలో విగ్రహాలపై వరుస దాడులు
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుద్ధుడి విగ్రహాన్నిగుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.
టెక్కలిలో ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత తాగునీటి పథకం పక్కనున్న ఉద్యాన వనంలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు, తెలుగుతల్లి విగ్రహంతోపాటు బుద్దుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
విగ్రహాలపై వరుస దాడులు జరుగుతున్న వేళ బుద్ధుడి విగ్రహంపై దాడితో మరోమారు కలకలం రేగింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు గ్రామీణ నీటి సరఫరా విభాగం డీఈ రాజు తెలిపారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/