చంద్రబాబుది రాక్షస మనస్తత్వం… జన్మలో మారడు – డిప్యూటీ సీఎం నారాయణస్వామి

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు ఫై అసెంబ్లీలో వైస్సార్సీపీ – టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. యూనివర్సిటీకి పేరు మార్పు బిల్లును వెనక్కి తీసుకోవాలని ఏపీ అసెంబ్లీ లో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి చంద్రబాబు ఫై నిప్పులు చెరిగారు.

అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. ‘‘ పేదవాడి పిల్లాడు చక్కగా చదువుకోవాలని జగన్ అమ్మ ఒడి తెచ్చారు. 85 శాతం మందికి కుప్పంలో అమ్మ ఒడి వర్తింపు చేస్తున్నాం. చంద్రబాబు కుప్పం ప్రజలకు ఒక్కరికైన డబ్బులు ఇచ్చాడా? ఒక్కరి అకౌంట్‌లో అయినా డబ్బులు వేసాడా? అని నారాయణస్వామి ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు కుప్పం వచ్చిన గలాటాలే, రచ్చలే. జనాన్ని రెచ్చగొట్టి బోరుమని ఏడుస్తాడు. చంద్రబాబు ఒక ఔరంగాజేబు లాంటోడు. చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తే… వైసీపీ 60 శాతం ఓట్లతో గెలుస్తుంది. చంద్రబాబుది రాక్షస మనస్తత్వం… జన్మలో మారడు. జడ్జ్‌లు కూడా రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నారు. మద్యంపై నడిచింది టీడీపీ.. వైసీపీ కాదు. ఒకరోజు టైం చెప్తే మద్యంపై పూర్తి క్లారిటీతో మాట్లాడతా. సారాను తీసుకొచ్చిందే టీడీపీ. నేను పారిపోను మద్యంపై చర్చకు సిద్ధంగా ఉన్నా అన్నారు. 175 నియోజకవర్గాలు గెలుస్తాం దానికి కుప్పం నాంది అని నారాయణస్వామి అన్నారు.