పడవ బోల్తా ఘటనపై డిప్యూటీ సిఏం ఆళ్ల నాని సంతాపం
సత్వరమే గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశం
Amaravati: సిలేరు రిజర్వాయర్ లో నాటు పడవ బోల్తా ఘటనపై డిప్యూటీ సిఏం , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సంతాపం తెలిపారు. మృతులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారికోసం సత్వరమే గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గల్లంతైన వారంతా కొందుగూడ గ్రామస్తులుగా గుర్తించారు అందరూ ఒరిస్సా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్య లక్ష్మి తో మంత్రి ఫోన్ లో వివరాలు తెలుసుకున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/