ఢిల్లీలో మహిళా ఎస్సై దారుణ హత్య
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓవైపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంటే… అంతకు ముందు రోజు రాత్రి 9.30 గంటలకు జరిగిన ఓ మర్డర్ కలకలం రేపుతోంది. అసలేం జరిగిందంటే… 26 ఏళ్ల మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతి అత్లావత్… ఢిల్లీ రోహిణీ ఏరియా మెట్రో స్టేషన్ నుంచీ ఇంటికి వెళ్తోంది. అంతలో ఎవరో ఆమెపై అనేకసార్లు కాల్పులు జరిపారు. దాంతో… ఆమెను అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఐతే ఆమెను ఎవరు కాల్చి చంపారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రస్తుతం ఆమె ఓ రేప్ కేసును డీల్ చేస్తోంది. ఆ కేసు దర్యాప్తు నుంచీ ఆమెను వెనక్కి వెళ్లాలని బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో హత్య జరగడంతో… ఆ కేసుకీ, ఈ హత్యకూ సంబంధం ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు దీపాన్షు రథి అనే వ్యక్తిపై అనుమానాలు కలుగుతున్నాయి. ఇతను 2018లో ఆమె బ్యాచ్ చెందినవాడే. శుక్రవారం రాత్రే ఇతను హర్యానాలోని సోనిపట్లో సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. కాల్పుల ఘటన తర్వాతే ఈ సూసైడ్ జరిగినట్లు సమాచారం. రెండు చోట్లా ఘటనాస్థలాల నుంచి పోలీసులు..డెడ్ బాడీలు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/