ఢిల్లీ అల్లర్లు ..34కు చేరిన మృతుల సంఖ్య

అన్ని ప్రాంతాల్లో పరిస్థితులు అదుపులో ఉన్నాయన అధికారులు

delhi
delhi

న్యూఢిల్లీ: ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా చెలరేగుతున్న ఆందోళనల్లో మృతుల సంఖ్య 34కు పెరిగింది. మరో 200 మందికిపైగా గాయపడినట్టు గుర్తించారు. ముఖ్యంగా ఆందోళనల సమయంలో దుకాణాలు, ఇళ్లకు నిప్పు పెట్టడంతో వాటిల్లో ఉన్నవారు గాయపడిన ఘటనలు బయటికి వస్తున్నాయి. భారీగా పోలీసులు, పారా మిలటరీ బలగాలు మోహరించడంతో ప్రస్తుతానికి అన్ని ప్రాంతాల్లో పరిస్థితులు అదుపులో ఉన్నాయని అధికారులు తెలిపారు. కాగా యాంటీ సీఏఏ ఆందోళనలకు కీలక కేంద్రాలుగా ఉన్న మౌజ్ పూర్, భజన్ పురా, కరవాల్ నగర్, జఫరాబాద్ తదితర ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్లలోంచి ఎవరూ బయటికి రావడం లేదు. ఢిల్లీ హైకోర్టు కూడా గట్టిగా అక్షింతలు వేయడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉన్నతా ధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/