ముగ్గురు ఐఎస్ఐఎస్‌‌ ఉగ్రవాదులు అరెస్ట్

Delhi Police
Delhi Police

న్యూఢిల్లీ: ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఇవాళ భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ఐఎస్ఐఎస్‌‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవాల కోసం దేశం యావత్తూ సిద్ధమవుతున్న తరుణంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో రాజధానిలో కలకలం రేగింది. ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో ఇవాళ ఉదయం జరిగిన ఓ ఎన్‌కౌంటర్ తర్వాత ఐఎస్ఐఎస్‌తో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడినట్టు ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/