ఢిల్లీ అల్లర్లు… ప్రధాన న్యాయమూర్తి బదిలీ

అర్ధరాత్రి పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ మురళీధర్‌

Justice S Muralidhar
Justice S Muralidhar

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ అర్లర్లతో ఉద్రిక్తతంగా మారింది. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అల్లర్ల నేపధ్యంలో పోలీసుల తీరును తప్పుపడుతూ నమోదైన పిటిషన్లను అర్ధరాత్రి విచారించిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మురళీధర్‌పై బదిలీ వేటు పడింది. అల్లర్ల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును న్యాయమూర్తి తప్పుపట్టారు. అయితే ఉదయానికల్లా జస్టిస్‌ మురళీధర్‌ బదిలీ ఉత్తర్వు ప్రకటన వెలువడడం గనార్హం.ఆయనను పంజాబ్‌హరియాణా కోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ గెజిట్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తక్షణం సంతకం చేయడం, ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశం అయ్యింది.

మురళీధర్‌ బదిలీ వ్యవహారంపై కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈనెల 12వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం ఆయన బదిలీకి ప్రతిపాదించగా, దీన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అప్పటి నుంచి ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అల్లర్లపై దాఖలైన పిటిషన్లను మురళీధర్‌ అర్ధరాత్రి తన ఇంట్లోనే విచారించి పోలీసుల తీరును తప్పుపట్టారు. ఒక వర్గాన్ని సురక్షితంగా ఆసుపత్రులకు తరలించడాన్ని అడ్డుకోవద్దంటూ పోలీసులను హెచ్చరిస్తూ మూడు పేజీల తీర్పు పాఠాన్ని వినిపించారు. ఈ విచారణ జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మురళీదర్‌పై బదిలీ వేటు పడడం చర్చనీయాంశంగా మారింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/