ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ను అదుపులోకి తీసుకున్న ఈడీ
హవాలా కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ను ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో సత్యేంద్ర జైన్, ఆయన బంధువులకు సంబంధాలున్నాయని భావిస్తున్న కంపెనీలకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ గత ఏప్రిల్లో జప్తు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద సత్యేంద్ర జైన్పై సీబీఐ 2017లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసు దర్యాప్తు సాగిస్తోంది.
కాగా, మంత్రి సత్యేందర్ను అరెస్ట్ చేసేందుకు ఈడీ సిద్ధంగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జనవరి నెలలోనే తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. మంత్రి సత్యేంద్ర జైన్పై 8 ఏళ్లుగా ఫేక్ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఇన్చార్జ్ గా వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.