దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

22 అగ్నిమాపక వాహనాలతో సహాయక చర్యలు!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని మయూరీ నగర్‌ ఫేజ్-2 ప్రాంతంలో ఈరోజు ఉదయం ఒక ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో ప్రాంతమంతా పొగమయంగా మారిపోయింది. స్థానికుల ద్వారా సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో మొత్తం 22 అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపుచేసే పనిలో ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాల గురించి తెలియరాలేదు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/