ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రచార హోరు కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఢిల్లీ సిఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం నరేలాలో రోడ్ షో నిర్వహించారు. ఢిల్లీలో జరుగుతున్న అభివఅద్ధి పనులను చూసి ఆప్ అభ్యర్థులను గెలిపించాలని కేజ్రీవాల్ ప్రజలను కోరారు. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8 న ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 11 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/