తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

నిన్న కేవలం 7 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

doctors
doctors

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య మరింత తక్కువగా నమోదు అయింది. శుక్రవారం రోజు 13 కేసులు, శనివారంరోజు 7 కేసులు నమోదు ఆయ్యాయి. కరోనా పరీక్షలు అధికంగా జరుగుతున్నప్పటికి కేసులు సంఖ్య తక్కువగా నమోదు కావడం శుభపరిణామం అని అధికారులు అంటున్నారు. ఓ దశలో రోజుకు ఆరవైనుంచి డెబ్బై కేసులు నమోదు అవగా అది ప్రస్తుతం పది కన్నా తక్కువకు పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజులలో లాక్‌డౌన్‌ నిబందనలలు సడలించి ప్రజా జీవనాన్ని సాధారణ స్థాయికి తీసుకువచ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిసంఖ 658 గా ఉంది.

తాజా అంతార్జతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/