సీఎం జగన్‌ మరో అనాలోచిత నిర్ణయం

మండలి రద్దుపై ఎటువంటి తీర్మానం లేకుండా అసెంబ్లీలో ఎలా చర్చిస్తారు?

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: శాసన మండలి రద్దుపై ఎటువంటి తీర్మానం చేయకుండా అసెంబ్లీలో దానిపై ఎలా చర్చిస్తారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ రోజు చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మండలి రద్దు జగన్‌ ప్రభుత్వం మరో అనాలోచిత నిర్ణయమన్నారు. అయినా మండలి రద్దు అనగానే ఇక్కడ బెదిరిపపోయేవారు ఎవరూ లేరన్నారు. ప్రస్తుతం రాజధాని అంశం సెలక్టు కమిటీ, కోర్టు పరిధిలో ఉందని, ఈ పరిస్థితుల్లో దానిపై అసెంబ్లీలో ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు. కౌన్సిల్‌ చైర్మన్‌ ప్రసంగానికి వక్రభాష్యాలు అంటగడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/