టర్కీ, సిరియాలో మృత్యు విలయం.. 15 వేలు దాటిన మరణాలు
సహాయ చర్యలకు కీలకమైన 72 గంటల సమయం దాటిన వైనం
అంకారాః టర్కీ, సిరియాలో భూకంప మరణాల సంఖ్య గంట గంటకూ పెరుగుతూనే ఉంది. ఇరు దేశాల్లో సంభవించిన ఘోర భూకంపాల వల్ల ఇప్పటికే 15 వేల మృతి చెందారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతుదేహాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. సోమవారం సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా టర్కీలో 12,391 మంది, సిరియాలో 2992 మంది మృతదేహాలను ఇప్పటిదాకా వెలికి తీశారు. శిథిలాల చిక్కుకున్న వారిలో దాదాపు 60 వేల పైచిలుకు మందిని సహాయ బృందాలు రక్షించాయి.
అయితే, సహాయ చర్యల్లో కీలకమైన 72 గంటల సమయం గడిచిపోయింది. దాంతో, ఇప్పటిదాకా శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో దక్కే అవకాశం లేదు. దాంతో,ఇకపై మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శిథిలాలతో పాటు గట్టగట్టిన మంచు కింద చిక్కుకొని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.