పెళ్లి ఊరేగింపులో పెళ్లికొడుకు మృతి
నిజామాబాద్: జిల్లా బోధన్ పట్టణంలో పెళ్లింట విషాదం నెలకొంది. వివాహమైన కొద్దిసేపటికే పెళ్లి కుమారుడు గణేష్ 25 మృతి చెందాడు. గణేష్కు శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరిగింది. రాత్రి పెళ్లి వేడుకలో భాగంగా బారాత్ నిర్వహించారు. పెళ్లి ఊరేగింపులో పెళ్లి కుమారుడు డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్కు అస్వస్థతకు గురైన గణేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బంధువులు ఆసుపత్రికి తరలించగా..అప్పటికే గుండేపోటుతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/