మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం : 14 మంది మృతి

ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తులు తిరిగి ఇంటికి వచ్చేవరకు కుటుంబ సభ్యుల్లో టెన్షనే. ఎందుకంటే ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు ఆలా జరుగుతున్నాయి. మనం జాగ్రత్తగానే వెళ్లిన అవతలి వ్యక్తి ఎలా వస్తాడో తెలియని పరిస్థితి. స్పీడ్ డ్రైవింగ్, నిద్ర మత్తు , తాగి డ్రైవ్ చేయడం ఇలా చేయడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

తాజాగా మధ్యప్రదేశ్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. ఆగి ఉన్న బస్సును వేగంగా వస్తున్న ఓ ట్రక్కు బలంగా ఢీ కొట్టడం తో 14 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. సిద్ది జిల్లాలోని రేవా-సత్నా సరిహద్దుల్లోని మోహనియా ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.