క్రీడాభిమానులపై జరిపిన లాఠీచార్జిని తీవ్రంగా ఖండించిన బిజెపి నేత దాసోజు శ్రవణ్
జింఖానా గ్రౌండ్ దగ్గర లాఠీఛార్జ్ ని బిజెపి నేత దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు.ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లు చేసిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జింఖానా మైదానంలో టికెట్లు విక్రయిస్తున్నారు. మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్ కు పోటెత్తారు. వేలాదిగా తరలి వచ్చిన క్రికెట్ అభిమానులను నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడం తో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
దీంతో పలువురు క్రికెట్ అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడగా..పలువురు అభిమానులు, పోలీసులు గాయపడ్డారు. క్రీడాభిమానులపై జరిపిన లాఠీచార్జిని తీవ్రంగా ఖండించారు బిజెపి నేత దాసోజు శ్రవణ్. ఇది పూర్తిగా హెచ్సీఏ, ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. హెచ్సీఏ యాజమాన్యంపై, అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. మరోపక్క మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం ఈ ఘటన పట్ల సీరియస్ అయ్యారు.