రేపు బిజెపి కండువా కప్పుకోబోతున్న దాసోజు శ్రవణ్

తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ రేపు బిజెపి కండువా కప్పుకోబోతున్నారు. నిన్న శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరు వల్లే కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈరోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి ఢిల్లీ కి వెళ్లిన ఆయన.. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్తో భేటీ అయ్యారు. అనంతరం శ్రవణ్కు శాలువా కప్పి తరుణ్ చుగ్ సత్కరించారు. బీజేపీ విద్యార్థి పరిషత్ తో పనిచేసిన శ్రవణ్ తో చాలాకాలం తర్వాత భేటీ కావడం సంతోషం కలిగించిందని అన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటోందని తరుణ్ చుగ్ ఆరోపించారు. ఢిల్లీ వచ్చిన బండి సంజయ్ తో పలు అంశాలపై చర్చింనట్లు చెప్పారు. ఆయన నాయకత్వంలో ప్రజా సంగ్రామ యాత్ర మోటార్ సైకిల్ యాత్రలు దిగ్విజయంగా నడుస్తున్నాయని చుగ్ ప్రశంసించారు. ఇక రేపు ఉదయం 8 గంటలకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో శ్రవణ్ కుమార్ బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక ఈ నెల 21 న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపి లో చేరనున్నారు. అదే రోజు మరికొంతమంది కాంగ్రెస్ , టిఆర్ఎస్ నేతలు బిజెపి లో చేరనున్నట్లు సమాచారం.