హాస్పటల్ లో చేరిన తెరాస ఎమ్మెల్యే

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కరోనా లక్షణాలతో హాస్పటల్ లో చేరారు. గత రెండు రోజులుగా జలుబు , జ్వరం తో దాసరి మనోహర్ రెడ్డి బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం కరోనా పరీక్షలు చేయించుకోగా..పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లో కరోనా చికిత్స పొందుతున్నారు.

ఇక ఈ మధ్య కాలంలో తన ను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సూచించారు. ఇక కరోనా బారిన ఇప్పటివరకు చాలామంది రాజకీయ నేతలు పడ్డారు. వీరిలో కొంతమంది ఆరోగ్యంగా బయటపడగా..మరికొంతమంది కరోనా కు బలయ్యారు.

కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుతున్నాయి. ఏపీలో హెచ్చు తగ్గులు ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి గతంలో కంటే ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు వేలాదిగా నమోదయ్యే కేసులు ప్రస్తుతం 300 పై చిలుకు వస్తున్నాయి. గత 24 గంటల్లో 67,720 మంది కరోనా పరీక్షలు నిర్వహించారు. 301 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తం కేసుల సంఖ్య 6,59,844కి చేరింది. కరోనాకు ఇద్దరు చనిపోయారు.